Share News

Hyderabad: తాను చనిపోతూ.. మరో ఏడుగురికి..

ABN , Publish Date - Jun 11 , 2025 | 08:07 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో మరో ఏడుగురికి ప్రాణదానం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్‌పేటకు చెందిన రాలపల్లి రాజు(24) ప్రైవేట్‌ కంపెనీలో వేబ్రిడ్జ్‌ ఆపరేటర్‌.

Hyderabad: తాను చనిపోతూ.. మరో ఏడుగురికి..

- అవయవ దానం.. మరో ఏడుగురికి ప్రాణదానం

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో మరో ఏడుగురికి ప్రాణదానం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్‌పేట(Miryalaguda Hanumanpet)కు చెందిన రాలపల్లి రాజు(24) ప్రైవేట్‌ కంపెనీలో వేబ్రిడ్జ్‌ ఆపరేటర్‌. ఈనెల 6వ తేదీన బైక్‌పై వెళ్తుండగా హనుమాన్‌పేట వద్ద స్కిడ్‌ అయింది. రాజు కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్‌(Hyderabad)లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.


city3.2.jpg

ఈనెల 9న వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. నిమ్స్‌ జీవన్‌ దాన్‌(NIMS Jeevan Than) ప్రతినిధులు అవయవదానంపై రాజు తండ్రి ఆదినారాయణకు అవగాహన కల్పించారు. అవయవ దానానికి ఆయన అంగీకరించారు. రాజు శరీరం నుంచి లివర్‌, 2 కిడ్నీలు, హార్ట్‌, లంగ్‌, 2 కార్నియాస్‌ సేకరించి ఏడుగురు వ్యక్తులకు అమర్చారు.



ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 08:07 AM