Share News

ఉద్యోగులను వేధిస్తున్నారు

ABN , Publish Date - Jan 29 , 2025 | 04:47 AM

గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) వ్యవహారం రోడ్డుకెక్కింది. బోర్డు సభ్యకార్యదర్శి(మెంబర్‌ సెక్రటరీ) వ్యవహారశైలిపై ఉద్యోగులు నిరసనగళమెత్తారు. మహిళా ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల పట్ల సభ్యకార్యదర్శి అజగేషన్‌

ఉద్యోగులను వేధిస్తున్నారు

గోదావరి బోర్డు మెంబర్‌ సెక్రటరీపై సీడబ్ల్యూసీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) వ్యవహారం రోడ్డుకెక్కింది. బోర్డు సభ్యకార్యదర్శి(మెంబర్‌ సెక్రటరీ) వ్యవహారశైలిపై ఉద్యోగులు నిరసనగళమెత్తారు. మహిళా ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల పట్ల సభ్యకార్యదర్శి అజగేషన్‌ అనుచితంగా, అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారని, పని వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదని వీరంతా ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుతో పాటు తెలంగాణ ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమను కాపాడాలని నివేదించుకోగా... ఈ వ్యవహారంపై ఆరా తీసిన అనిల్‌కుమార్‌.. తక్షణ మే అజగేషన్‌ను బదిలీ చేయాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల పట్ల అనుచితంగా, అవమానపరిచే విధంగా అజగేషన్‌ ప్రవర్తన ఉందని, గోదావరి బోర్డు సభ్యుడిగా ఈ విషయాన్ని నివేదిస్తున్నానని కోరారు. అజగేషన్‌ వైఖ రి వృత్తిపరమైన ప్రమాణాలను దెబ్బతీస్తుందని అనిల్‌కుమార్‌ నివేదించారు. తక్షణమే అతడిని బదిలీ చేయాలని విజ్ఙప్తి చేశారు.



Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 04:47 AM