Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలకు సీఎం, గవర్నర్
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:48 AM
ఖైరతాబాద్లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముస్తాబైన స్వామి వారికి చవితి పండుగ రోజున తొలి....
ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి ఆహ్వానించిన ఉత్సవ కమిటీ..
హైదరాబాద్/ఖైరతాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముస్తాబైన స్వామి వారికి చవితి పండుగ రోజున తొలి పూజలను సీఎం రేవంత్రెడ్డి నిర్వహించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం పూజలకు హాజరు కానున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ నేతృత్వంలో ప్రతినిధులు సీఎంను ఆయన నివాసంలో కలి’ట ఆహ్వాన పత్రికను అందజేశారు. తొలిరోజు పూజలకు హాజరవుతానని సీఎం హామీ ఇచ్చినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్లపై మోదీ
ట్రంప్ టారిఫ్లపై పీఎంవో కీలక సమావేశం
For More National News