Charlapalli: చర్లపల్లిలో అగ్ని ప్రమాదం.. తప్పిన ముప్పు
ABN , Publish Date - May 19 , 2025 | 03:49 AM
చర్లపల్లి పారిశ్రామిక వాడలో చర్లపల్లి రైల్వే టర్మినల్కు వెళ్లే దారిలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. పెను ముప్పు తప్పింది.
బ్యాటరీ పేలుడుతో దగ్ధమైన ఖాళీ ట్యాంకర్
కుషాయిగూడ, మే 18 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి పారిశ్రామిక వాడలో చర్లపల్లి రైల్వే టర్మినల్కు వెళ్లే దారిలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. పెను ముప్పు తప్పింది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి వాసి కడియాల భవానీ(50).. భవానీ ట్రాన్స్పోర్టు పేరిట గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లు నడుపుతున్నారు. తాను నడిపే ట్యాంకర్లలో ఒక ట్యాంకర్ (ఏపీ29 డబ్ల్యూ 0279)ను అమ్మకానికి పెట్టారు. దాని కొనడానికి వచ్చిన హైదరాబాద్ నగర వాసి పి.రవి.. ఆదివారం మధ్యాహ్నం 1.20గంటలకు టెస్ట్ డ్రైవింగ్కు వెళ్లాడు.
ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద ట్యాంకర్ను స్టార్ట్ చేసి.. బీపీసీఎల్ గ్యాస్ కంపెనీ ఎదురుగా యూ-టర్న్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్లోని బ్యాటరీ పేలడంతో ఫ్యుయల్ ట్యాంకులో 120 లీటర్ల డీజిల్ ఉండటంతో ఎగసి పడ్డ మంటలు.. పక్కనే ఉన్న రెండు ఖాళీ సిలిండర్ల వాహనాల కు అంటుకున్నాయి. అగ్ని మాపక దళ సిబ్బంది 4 ఫైరింజన్లలో వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ఘటనలో భవానీ ట్రాన్స్పోర్టు ట్యాంకర్తోపాటు అక్కడ ఖాళీ సిలిండర్లతో నిలిపి ఉన్న 2 వాహనాల టైర్లు దగ్ధమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News