Share News

CBI: హైదరాబాద్‌లో సీబీఐ డైరెక్టర్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:41 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ శుక్రవారం హైదరాబాద్‌ వచ్చారు.

CBI: హైదరాబాద్‌లో సీబీఐ డైరెక్టర్‌

  • జోన్‌ అధికారులతో రెండు గంటలకు పైగా భేటీ

  • కాళేశ్వరం కేసు నేపథ్యంలో ఆకస్మిక పర్యటన?

హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ శుక్రవారం హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ జోన్‌ సీబీఐ అధికారులతో రెండు గంటలకు పైగా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్‌ సూద్‌ ఆకస్మికంగా హైదరాబాద్‌లో పర్యటించారు. అయితే, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హరీశ్‌రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ప్రవీణ్‌ సూద్‌ ఏ విషయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారనే విషయంలో స్పష్టత లేదు.

Updated Date - Sep 06 , 2025 | 04:41 AM