Bengaluru: బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:22 AM
శేషాద్రిపురం, మల్లేశ్వరం, శ్రీరాంపుర పోలీసుస్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన వాహనాలను 2016 నుంచి ఈ మైదానంలో ఉంచుతున్నారు.

వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలు దగ్ధం
బెంగళూరు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని శేషాద్రిపురం జేడీఎస్ కార్యాలయం పక్కనున్న మైదానంలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి వివిధ కేసులలో సీజ్ చేసిన వందకుపైగా వాహనాలు దగ్ధమయ్యాయి. శేషాద్రిపురం, మల్లేశ్వరం, శ్రీరాంపుర పోలీసుస్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన వాహనాలను 2016 నుంచి ఈ మైదానంలో ఉంచుతున్నారు. జక్కరాయన చెరువుగా పిలవబడే ఈ ప్రాంతంలో రెండు ఎకరాలకుపైగా ఖాళీ స్థలం ఉంది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి, ఆర్పేయకుండా పడేయడంతో గడ్డి, మొక్కలు అంటుకుని అగ్ని కీలలు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు దగ్ధమయ్యాయి.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్రౌండర్కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి