Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ అశోక్ తో బీసీ నేతల భేటీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:47 AM
జాతీయస్థాయిలో ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఓబీసీ మహాసభ సందర్భంగా గోవా వెళ్లిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు రాజ్ భవన్లో అశోక్ గజపతిరాజుని కలిసి బీసీల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
బీసీలకు చట్టసభల్లో జనాభా దామషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల కల్పన, మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News