Share News

Animals Rescue: అక్రమంగా తరలిస్తున్న 89 మూగజీవాలకు విముక్తి

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:59 AM

కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 89 మూగజీవాలను సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పోలీసులు పట్టుకున్నారు....

Animals Rescue: అక్రమంగా తరలిస్తున్న 89 మూగజీవాలకు విముక్తి

  • కంటైనర్‌ సీజ్‌.. యజమానిపై కేసు నమోదు

గజ్వేల్‌/గజ్వేల్‌ రూరల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 89 మూగజీవాలను సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పోలీసులు పట్టుకున్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పాతూరు చౌరస్తా వద్ద అన్నవరం నుంచి వస్తున్న కంటైనర్‌ను తనిఖీ చేయగా 89 మూగజీవాలున్నాయి. అప్పటికే చనిపోయిన ఏడు పశువులకు పోస్టుమార్టం నిర్వహించి, మిగిలిన వాటిని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్‌ గోశాలకు తరలించారు. కంటైనర్‌కు కర్ణాటకతో పాటు తెలంగాణకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. కంటైనర్‌ లారీ ఓనర్‌, డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:59 AM