Shubman Gill Wins: నాలుగోసారి ఐసీసీ అవార్డు
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:12 AM
ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలకుగాను గిల్ ఈ అవార్డును అందుకోనున్నాడు..
శుభ్మన్ రికార్డు
న్యూఢిల్లీ: ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలకుగాను గిల్ ఈ అవార్డును అందుకోనున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్డర్లను అధిగమించి గిల్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇక, ఈ అవార్డుకు ఎంపికవడం గిల్కిది నాలుగోసారి. ఈ క్రమంలో అత్యధికసార్లు అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్గా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News