Share News

Pooja Rani Semifinal in World Boxing: సెమీఫైనల్లో పూజ

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:27 AM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌కు మూ డో పతకం ఖాయమైంది. మహిళల 80 కి. విభాగంలో పూజారాణి సెమీఫైనల్‌కు చేరిం ది. బుధవారం అర్ధరాత్రి హోరాహోరీగా జరిగిన...

Pooja Rani Semifinal in World Boxing: సెమీఫైనల్లో పూజ

  • భారత్‌కు మరో పతకం ఖాయం

  • ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్స

లివర్‌పూల్‌ (ఇంగ్లండ్‌): ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌కు మూ డో పతకం ఖాయమైంది. మహిళల 80 కి. విభాగంలో పూజారాణి సెమీఫైనల్‌కు చేరిం ది. బుధవారం అర్ధరాత్రి హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 34 ఏళ్ల పూజ 3-2తో ఎమీలియా కొటెర్‌స్కా (పోలెండ్‌) ఓడించింది. సెమీ్‌సకు చేరిన పూజారాణికి కనీసం కాంస్యం లభించనుంది. ప్రపంచ పోటీలలో ఆమెకిదే తొలి పతకం. ఇక జైస్మీన్‌ లంబోరియా (మహిళల 57కి.), నూపుర్‌ షెరాన్‌ (మహిళల 80+కి.) ఇంతకుముందే సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖరారైన సంగతి తెలిసిందే. పురుషుల 65కి. కేటగిరీ క్వార్టర్‌ఫైనల్లో అభినాష్‌ జమ్వల్‌ 1-4తో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లాష గురులీ (జార్జియా) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:27 AM