Mukesh Neelavalli: ముకేశ్కు స్వర్ణం
ABN , Publish Date - Oct 02 , 2025 | 06:18 AM
తెలుగు షూటర్ ముకేశ్ నేలవల్లి మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు. రెండ్రోజుల క్రితం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో రజతం నెగ్గిన ఈ గుంటూరు కుర్రాడు.. టోర్నీకి ఆఖరిరోజైన బుధవారం...
తేజస్వినికి రజతం
జూ. షూటింగ్ వరల్డ్ కప్
న్యూఢిల్లీ: తెలుగు షూటర్ ముకేశ్ నేలవల్లి మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు. రెండ్రోజుల క్రితం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో రజతం నెగ్గిన ఈ గుంటూరు కుర్రాడు.. టోర్నీకి ఆఖరిరోజైన బుధవారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఏకంగా స్వర్ణం సాధించాడు. ఓవరాల్గా 585 స్కోరుతో ముకేశ్ విజేతగా నిలిచాడు. అలెగ్జాండర్ కొవలెవ్ (తటస్థ అథ్లెట్) రజతం, భారత్కే చెందిన సాహిల్ చౌధురి కాంస్యం నెగ్గారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని రజతం గెలిచింది. ఈ టోర్నీలో భారత్ 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 19 పతకాలు నెగ్గి టాప్లో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News