Prime Volleyball League: కోల్కతా బోణీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:38 AM
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కోల్కతా థండర్ బోల్ట్స్ శుభారంభం చేసింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కోల్కతా థండర్ బోల్ట్స్ శుభారంభం చేసింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కొచ్చి బ్లూ స్పైకర్స్తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో కోల్కతా 3-1 (12-15, 15-13, 15-6, 19-17)తో నెగ్గింది. నిర్ణయాత్మక నాలుగో సెట్లో విజయం కోసం ఇరు జట్లూ చివరి వరకు పోరాడాయి. చివరికి సెట్తో పాటు మ్యాచ్ను కూడా కోల్కతా దక్కించుకుంది. కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించిన పంకజ్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News