Ind vs Pak: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బౌలింగ్ చేయనున్న భారత్!
ABN , Publish Date - Feb 23 , 2025 | 02:13 PM
టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్కు సిద్ధమవుతోంది. దుబాయ్ ఈ ఆసక్తికర మ్యాచ్కు వేదికగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్కు సిద్ధమవుతోంది. దుబాయ్ ఈ ఆసక్తికర మ్యాచ్కు వేదికగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్తో జరిగే ఈ మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది (Champions Trophy).
ఆదివారం భారత్తో జరిగే మ్యాచ్లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్ను పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, టీమిండియా గత మ్యాచ్లో బరిలోకి దిగిన టీమ్తోనే మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్ మాత్రం గత మ్యాచ్తో పోల్చుకుంటే ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, షౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా, తయ్యబ్ తీహార్, కుష్దీల్ షా, షహీన్ ఆఫ్రీది, నజీమ్ షా, హరీష్ రౌఫ్, అబ్రార్ అహ్మద్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..