Share News

Korea Masters 2025: కొరియాలో భారత్‌కు నిరాశ

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:07 AM

కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. బుధవారం బరిలోకి దిగిన భారత షట్లర్లలో ఒక్కరు కూడా ముందంజ...

Korea Masters 2025: కొరియాలో భారత్‌కు నిరాశ

సువాన్‌: కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. బుధవారం బరిలోకి దిగిన భారత షట్లర్లలో ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. పురుషుల సింగిల్స్‌ ఆరంభ రౌండ్లో చికో ఆరా ద్వి వార్దోయా (ఇండోనేసియా)తో పోరులో 8-16తో వెనుకంజలో ఉన్న దశలో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ గాయం కారణంగా అర్థంతరంగా వెనుదిరిగాడు. మిగతా షట్లర్లలో ఆయుష్‌ షెట్టి 18-21, 18-21తో సు లి యాంగ్‌ (తైపీ) చేతిలో, కిరణ్‌ జార్జ్‌ 14-21, 22-20, 14-21తో లో కీన్‌ యే (సింగపూర్‌) చేతిలో, అనుపమ ఉపాధ్యాయ 16-21, 15-21తో పుత్రి వర్దాని (ఇండోనేసియా) చేతిలో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మోహిత్‌ జగ్లాన్‌/లక్షిత జగ్లాన్‌ జోడీ 7-21, 14-21తో జపాన్‌ ద్వయం యు షిమోగామి/సయాక హొబార చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 03:07 AM