Bengaluru Torpedoes: వాలీబాల్ విజేత బెంగళూరు
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:27 AM
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సీజన్-4 టైటిల్ను బెంగళూరు టార్పెడోస్ జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సీజన్-4 టైటిల్ను బెంగళూరు టార్పెడోస్ జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగళూరు 3-0 (15-13, 16-4, 15-13)తో ముంబై మీటియర్స్పై ఘన విజయం సాధించింది. జోయెల్ బెంజిమిన్, సేతు, మాట్వెస్ట్ బెంగళూరు గెలుపులో ముఖ్యభూమిక పోషించారు. పీవీఎల్లో బెంగళూరు టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ సీజన్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు తొమ్మిదో స్థానంతో ముగించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News