Share News

Chennai Grandmasters 2025: అర్జున్‌కు ఇంకో డ్రా

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:43 AM

తెలుగు జీఎం అర్జున్‌ ఇరిగేసికి చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ టోర్నీలో వరుసగా మూడో డ్రా ఎదురైంది. బుధవారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో జీఎం అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో అర్జున్‌ పాయింట్‌ పంచుకొన్నాడు...

Chennai Grandmasters 2025: అర్జున్‌కు ఇంకో డ్రా

చెన్నై: తెలుగు జీఎం అర్జున్‌ ఇరిగేసికి చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ టోర్నీలో వరుసగా మూడో డ్రా ఎదురైంది. బుధవారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో జీఎం అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో అర్జున్‌ పాయింట్‌ పంచుకొన్నాడు. తెల్లపావులతో ఆడిన ఇరిగేసి 35 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించాడు. రే రాబ్సన్‌ (అమెరికా)పై నిహాల్‌ సరీన్‌, విదిత్‌ గుజరాతీపై కార్తికేయన్‌ గెలిచారు. ఏడు రౌండ్లు ముగిసే సరికి అర్జున్‌ మొత్తం 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, చాలెంజర్స్‌ విభాగంలో జీఎం హారిక ద్రోణవల్లి ఐదో ఓటమి చవిచూసింది. సహచరుడు హర్షవర్ధన్‌ చేతిలో హారిక, ప్రణేష్‌ చేతిలో వైశాలి పరాజయం పాలయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 01:43 AM