Ranji Trophy Victory: అభిరథ్ అజేయ శతకం
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:25 AM
ఓపెనర్ అభిరథ్ రెడ్డి (175 నాటౌట్) భారీ శతకంతో అదరగొట్టాడు. దీంతో హిమాచల్ ప్రదేశ్తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ ఎలీట్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 4 వికెట్ల తేడాతో..
హైదరాబాద్ విజయం జూ హిమాచల్తో రంజీ
నదౌన్ (హిమాచల్ ప్రదేశ్): ఓపెనర్ అభిరథ్ రెడ్డి (175 నాటౌట్) భారీ శతకంతో అదరగొట్టాడు. దీంతో హిమాచల్ ప్రదేశ్తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ ఎలీట్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 344 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మంగళవారం తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 347 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ రాదేశ్ (66), హిమతేజ (33), తనయ్ (29) సహకరించారు. ఆర్యమాన్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు హిమాచల్ తొలి ఇన్నింగ్స్లో 318, హైదరాబాద్ 278 పరుగులు చేయగా.. హిమాచల్ రెండో ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి...
వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్రెడ్డి
ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News