Vinayaka Chavithi 2025: సందడిగా మారిన మోండా మార్కెట్
ABN, Publish Date - Aug 26 , 2025 | 09:49 PM
వినాయక చవిత నేపథ్యంలో సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ సందడిగా మారింది. పూజ చేసేందుకు పత్రి, పూలు, వినాయకుడి విగ్రహం కోసం మంగళవారం మార్కెట్కు ప్రజలు పోటెత్తారు.
1/7
వినాయక చవిత నేపథ్యంలో మోండా మార్కెట్ మంగళవారం సందడిగా మారింది.
2/7
పూజ చేసేందుకు పత్రి, పూలు, వినాయకుడి విగ్రహం కోసం మంగళవారం మార్కెట్కు ప్రజలు పోటెత్తారు.
3/7
ఈ సందర్భంగా పూల దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిక్కిరిసి పోయాయి.
4/7
దేవుని విగ్రహాలతోపాటు పత్రి విక్రయాలు జోరుందుకున్నాయి. వీటి కొనుగోలు కోసం భక్తులు బేరసారాలకు దిగారు.
5/7
అలాగే అరటి పళ్లు, కొబ్బరికాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
6/7
వీటికి పోటీగా పత్రి ధరలు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు చవితి ఘడియలు ఉన్నాయి.
7/7
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లోపే పూజకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఊరు వాడా అంతా మార్కెట్లకు తరలి వెళ్లారు.
Updated at - Aug 26 , 2025 | 09:49 PM