మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి.. సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
ABN, Publish Date - May 21 , 2025 | 03:10 PM
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీలోకి అగ్రనేతలు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా నేతలు ప్రస్తుతించారు.
1/5
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నేత వీహెచ్
2/5
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలు జల్లి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
3/5
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించిన అనంతరం ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
4/5
దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
5/5
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద పూలతో అలంకరించారు. వర్షం పడుతుండడంతో.. భద్రతా సిబ్బంది రాజీవ్ చిత్ర పటానికి గొడుగు పట్టారు.
Updated at - May 21 , 2025 | 03:10 PM