Saraswati Pushkaralu 2025: ముగియనున్న సరస్వతి పుష్కరాలు.. పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 25 , 2025 | 02:14 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో పుణ్య స్నానమాచరించేందుకు భక్తులు భారీగా కాళేశ్వరానికి తరలి వచ్చారు. సరస్వతి నదిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా కాళేశ్వరం తరలి వస్తున్నారు. ఈ పుష్కరాలు మే 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానమాచరిస్తే.. కోరికలు తీరుతాయని భక్తులు విశ్వస్తారు.
1/7
సరస్వతి పుష్కరాల కోసం కాళేశ్వరానికి భక్తులు పొటెత్తారు.
2/7
నదిలో పుణ్యస్నానమాచరిస్తున్న భక్తులు
3/7
స్నానం ఘాట్ల వద్ద భక్తుల కోలాహలం
4/7
పుష్కరాల్లో భాగంగా తన కుటుం పెద్దలకు పిండ ప్రదానం చేస్తున్న భక్తుడు
5/7
పుణ్య స్నానమాచరిస్తున్న మహిళ
6/7
పుష్కరాల కోసం కాళేశ్వరం వస్తున్న భక్తులు.. భారీగా నిలిచిన వాహనాలు
7/7
పుణ్య స్నానమాచరించి... సుర్య భగవానుడికి నమస్కరిస్తున్న భక్తులు
Updated at - May 25 , 2025 | 02:16 PM