కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు
ABN, Publish Date - May 23 , 2025 | 12:27 PM
Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో వారు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ఈ పుష్కరాలకు వస్తున్నారు. మే 15వ తేదీన ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.
1/7
సరస్వతి పుష్కరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా కాళేశ్వరం తరలి వస్తున్నారు. సరస్వతి నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు
2/7
నదిలో పుణ్య స్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతి
3/7
నదిలో పుణ్యస్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతులు
4/7
నదిలో యువతికి చెంబుతో తలస్నానం చేయిస్తున్న మహిళ
5/7
నదిలో స్నానమాచరించి... సూర్యభగవానుడికి నమస్కరిస్తున్న యువతి.
6/7
నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహం
7/7
నదీ పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వరుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులు
Updated at - May 23 , 2025 | 12:31 PM