సర్వం సిద్ధం.. నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు
ABN, Publish Date - Sep 04 , 2025 | 08:19 PM
నవరాత్రల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని నిజమజ్జనం చేసేందుకు సమయం అసన్నమైంది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతిని నిమజ్జనం చేస్తున్నారు.
1/10
నవరాత్రల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని నిజమజ్జనం చేసేందుకు సమయం అసన్నమైంది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతిని నిమజ్జనం చేస్తున్నారు.
2/10
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్లు మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయి. అందుకోసం మున్సిపల్, పోలీస్ ఉన్నతాధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
3/10
ఆ క్రమంలో నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
4/10
భద్రత, రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు.
5/10
హైదరాబాద్ మహానగరంలో నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను అధికారులు ఏర్పాటు చేశారు.
6/10
134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉంచారు. ఇక ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్లో 9 బోట్లు సిద్ధం చేశారు.
7/10
200 మంది గజ ఈతగాళ్లను చెరువులు, కొలనుల వద్ద ఉంచనున్నారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు.
8/10
నిమజ్జన యాత్ర మార్గాల్లో 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
9/10
ఇక ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం 6వ తేదీ నిర్వహించనున్నారు. దీనిని ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటలోపు పూర్తిచేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రత్తమయ్యారు.
10/10
భారీ వర్షాలకు నగరంలోని పలుప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారాయి. వాటికి మరమ్మతులు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
Updated at - Sep 04 , 2025 | 08:19 PM