Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్..
ABN, Publish Date - Feb 22 , 2025 | 07:03 PM
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో నాగచైతన్య- శోభిత ధూళిపాల జంట ఒకటి. గతేడాది వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ యువ దంపతులు వారి గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులిచ్చి ధైర్యం చెప్పారు.

హైదరాబాద్లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్లో చిన్నారుల మధ్య టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ఆయన సతీమణి శోభిత ధూళిపాల ఆనందంగా గడిపారు.

క్యాన్సర్తో బాధపడే పిల్లల్లో నాగ చైతన్య, శోభిత ధూళిపాల మనోధైర్యాన్ని నింపారు.

క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు, వారి కుటుంబాలకు సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ ఉచిత ఆశ్రయం కల్పిస్తుంది.

సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ను శనివారం నాడు నాగ చైతన్య, శోభిత ధూళిపాల సందర్శించి చిన్నారులతో ఆడిపాడారు.

చిన్నారులతో కలిసిపోయి.. వారితో కలిసి సరదాగా నాగ చైతన్య డ్యాన్స్ కూడా చేశారు. పిల్లలతో సెల్ఫీలు దిగి ముచ్చటించారు.

పిల్లలతో కబుర్లు చెబుతూ వారి కళ్లల్లో శోభిత ఆనందాన్ని నింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి.

అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య- శోభితలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా..ఇటీవలే చైతు నటించిన తండేల్ సినిమా బ్లాక్ బస్టర్గా దూసుకెళ్తుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటేసింది.
Updated at - Feb 22 , 2025 | 10:11 PM