Bonalu Festival 2025: ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో రంగం వినిపించిన స్వర్ణలత
ABN, Publish Date - Jul 14 , 2025 | 07:47 PM
ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో (Ujjaini Mahakali Temple) ఈరోజు (సోమవారం) రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (Swarnalatha Bhavishya Vani) వినిపించారు.
1/14
ఆషాఢం మాసం కావడంతో.. తెలంగాణలో బోనాలు పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్లో కొలువు తీరిన ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో సోమవారం అంటే.. జులై 14వ తేదీ రంగం నిర్వహించారు.
2/14
ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి ఆమె భవిష్యవాణి చెప్పారు.
3/14
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. తాను కోపంగా లేనన్నారు.
4/14
తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారంటూ హెచ్చరించారు.
5/14
తన భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానన్నారు.
6/14
కానీ ప్రతీ ఏడాది ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు చెప్పారు.
7/14
ప్రతీ సంవత్సరం చెబుతున్నప్పటికీ తనను లెక్క చేయడం లేదన్నారు.
8/14
నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలని పేర్కొన్నారు.
9/14
నా కోపానికి మీరు బలి అవుతారు.. కానీ నేను కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుకుని చస్తారన్నారు.
10/14
దేవాలయం వద్ద అమ్మవారిని ఊరేగిస్తున్న దృశ్యం.
11/14
దేవాలయం బయట భక్తుల కిటకిట..
12/14
దేవాలయం వెలుపల.. ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు..
13/14
దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు
14/14
సికింద్రాబాద్లో ఉజ్జయినీ దేవాలయంలో కొలువు తీరిన మహాకాళి అమ్మవారు.
Updated at - Jul 14 , 2025 | 07:55 PM