నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్

ABN, Publish Date - Dec 21 , 2025 | 05:10 PM

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్ 1/6

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్ 2/6

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాయని చెప్పారు. అంతేకాదు.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత సైతం కనిపించిందని తెలిపారు.

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్ 3/6

తనను దూషించడమే ఈ ప్రభుత్వ విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్ 4/6

కాంగ్రెస్ పార్టీ అధికార పీఠమెక్కి రెండేళ్లు అయినా.. నేటికి ఒక్క కొత్త పాలసీ సైతం తీసుకు రాలేదని విమర్శించారు. తెచ్చిన ఒక్క పాలసీ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిందేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ తగ్గిందన్నారు.

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్ 5/6

గతంలో యూరియా ఇంటికి, పంట చేనుకి వచ్చేదని గుర్తు చేశారు. కానీ నేడు యూరియా కోసం కుటుంబాలు క్యూ లైన్లలో కూర్చోవలసిన దుస్థితి నెలకుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్ 6/6

ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated at - Dec 21 , 2025 | 05:10 PM