బాబోయ్ చలి .. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ABN, Publish Date - Dec 06 , 2025 | 05:56 PM
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.
1/6
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి ఇబ్బందులు పడుతున్నారు.
2/6
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలిమంట కాచుకుంటున్నారు.
3/6
హైదరాబాద్లో జెన్టీయూ, KPHB రోడ్, జగత్ గిరి గుట్టలో చలి తీవ్రతలోనూ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
4/6
సాధారణంగానే పేపర్ బాయ్స్.. వేకువజామునే తమ పనిని ప్రారంభిస్తారు. అయితే, ప్రస్తుతం చలి ఎక్కవుగా ఉండడంతో స్వెట్టర్లు ధరించి మరీ, ఏమాత్రం ఆలస్యం కాకుండా వార్తపత్రికలను సిద్ధం చేస్తున్నారు.
5/6
జగత్ గిరి గుట్ట, KPHB, వివేకానంద నగర్ బస్టాప్ లలో నిరాశ్రయులు విశాంత్రి తీసుకుంటున్నారు.
6/6
రానున్న రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Updated at - Dec 06 , 2025 | 06:02 PM