హైదరాబాద్ హైటెక్స్లో బయో ఆసియా సదస్సు
ABN, Publish Date - Feb 25 , 2025 | 01:45 PM
ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్లో బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
1/6
హైదరాబాద్లోని హైటెక్స్లో బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఉదయం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సదస్సును మొదలుపెట్టారు.
2/6
ఈ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
3/6
ఈ బయో ఆసియా సదస్సులో ఫార్మా, లైఫ్సైన్సెస్, బయోటెక్ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్లు పాల్గొన్నారు. ఏఐ ఆధారిత లైఫ్ సైన్సెస్, క్లినికల్ ట్రయిల్స్పై సదస్సులో చర్చించారు.
4/6
సులభతర పరిశోధనలు, ఉత్పత్తుల తయారీపై సదస్సులో డిస్కస్ చేశారు. వినూత్న ఆలోచనలు, విధివిధానాల మార్పిడి, అంకుర పరిశ్రమలపై కూడా కార్యక్రమంలో చర్చించారు.
5/6
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సదస్సు జరగడం ఇది రెండోసారి. గత బయో ఆసియా సదస్సులో జీవ వైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చించారు.
6/6
ప్రస్తుత సదస్సులో ప్రధానంగా ఏఐ ఆధారిత అంశాలపై చర్చ జరిగింది. బంగారు భవిష్యత్తు సాధించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ అన్నారు.
Updated at - Feb 25 , 2025 | 01:46 PM