తెలంగాణలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN, Publish Date - Apr 21 , 2025 | 10:18 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని పాల్గొని 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని పాల్గొన్నారు.

చంద్రబాబు బర్త్ డే సందర్భంగా నందమూరి సుహాసిని 75కేజీల కేకు కట్ చేశారు.

నందమూరి సుహాసినితో ఫొటోలు దిగుతున్న టీడీపీ నేతలు

కేపీహెచ్బీలోని జేఎన్టీయూ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణలో కూడా టీడీపీ బలపడుతుందని నందమూరి సుహాసిని తెలిపారు.

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 75 కేజీల కేక్ కట్ చేశారు.

ఈ వేడుకల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

కేకు కట్ చేసి సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులను సన్మానించారు.

ఖమ్మం జిల్లాలోని పాండురంగాపురం సెంటర్లో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Updated at - Apr 21 , 2025 | 10:33 AM