Tribals Dharma Yddham In Utnoor: ధర్మ యుద్ధం బహిరంగ సభకు పోటెత్తిన ఆదివాసీలు
ABN, Publish Date - Nov 23 , 2025 | 07:35 PM
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది. స్థానిక ఎంపీడీవో గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఈ మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వచ్చారు. గత అనుభవాల దృష్ట్యా ఈ మహాసభ వద్ద కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
1/8
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది. స్థానిక ఎంపీడీవో గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఈ మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వచ్చారు.
2/8
గత అనుభవాల దృష్ట్యా ఈ మహాసభ వద్ద కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉట్నూర్ వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
3/8
ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసీఫాబాద్ మార్గాల్లో వెళ్లే వాహనాలను గుడిహత్నూర్ క్రాస్ రోడ్డు వద్ద నిలిపి వేసి.. నిర్మల్ వైపు మళ్లించారు.
4/8
రాష్ట్ర శాంతి భద్రతల డీజీ మహేశ్ భగవత్ శనివారం నుంచి ఉట్నూరులోనే ఉండి బందో బస్తును పర్యవేక్షిస్తున్నారు.
5/8
గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఆదివాసీలు తప్పు మరోకరు ఈప్రాంతంలోకి రాకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
6/8
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు.
7/8
ఇక లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
8/8
ఆ తర్వాత ఈ ఉద్యమం కాస్తా నెమ్మదించింది. అనంతరం ఈ ఆదివాసీలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అందుకోసం ఆదివాసీ సంఘాన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. తమకు రావాల్సిన రిజర్వేషన్లను దొడ్డి దారిన లంబాడాలు దోచుకుంటున్నారని ఆదివాసీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated at - Nov 23 , 2025 | 07:41 PM