Neiphiu Rio: నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియోతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ
ABN, Publish Date - Nov 19 , 2025 | 06:41 AM
నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియు రియోతో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. నాగాలాండ్లో వైమానిక అనుసంధానం బలోపేతంపై చర్చించారు. నాగాలాండ్ రాష్ట్రంలోని ఎయిర్పోర్టులకు మౌలిక సదుపాయాల కల్పనకు, వాటి అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.
1/8
నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియు రియోతో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.
2/8
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. నాగాలాండ్లో వైమానిక అనుసంధానం బలోపేతంపై చర్చించారు.
3/8
నాగాలాండ్ రాష్ట్రంలోని ఎయిర్పోర్టులకు మౌలిక సదుపాయాల కల్పనకు, వాటి అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారాలను ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.
4/8
ప్రకృతి సోయగాలు, అందుకు సమాన రీతిలో సాంస్కృతిక సంపద కలిగిన నాగాలాండ్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా విశేష ప్రయోజనం కలుగుతుందని వివరించారు రామ్మోహన్ నాయుడు.
5/8
నాగాలాండ్లో అధికంగా ఉత్పత్తి అయ్యే పండ్లు, చేపల రవాణాకు విస్తృత అవకాశాలు ఉన్నందున ఎయిర్ కార్గో అభివృద్ధిపైనా చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
6/8
ఈ సమావేశంలో పాల్గొన్న నాగాలాండ్ సీఎం నేఫియు రియో, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి వర్గం.
7/8
నేఫియు రియోతో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడారు.
8/8
వైమానిక రంగాన్ని నాగాలాండ్కు అనుసందానిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ వివరించారు.
Updated at - Nov 22 , 2025 | 06:58 AM