Indian Railways: రాత్రి వేళలో రైళ్లు వేగంగా నడుస్తాయి.. కారణమేంటో తెలుసా..?
ABN, Publish Date - Sep 19 , 2025 | 01:16 PM
రైల్వే వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖచ్చుతో, తక్కువ సమయంలోనే తమ డెస్టినేషన్లకు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రజలు సైతం ట్రైన్ జర్నీకి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.
1/6
భారతదేశంలో రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఒక విధంగా చెప్పాలంటే వెన్నెముక వంటిదని చెప్పాలి.
2/6
రైల్వే వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖచ్చుతో, తక్కువ సమయంలోనే తమ డెస్టినేషన్లకు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రజలు సైతం ట్రైన్ జర్నీకి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.
3/6
అయితే, ట్రైన్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రైళ్లు పగటి సమయంలో కంటే రాత్రి సమయంలోనే ఎక్కువ వేగంతో నడుస్తాయని మీకు తెలుసా? మరి ఈ తేడాకు గల కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
4/6
సాధారణంగా రాత్రి సమయంలో కంటే పగటి సమయంలో ట్రాక్లపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. పగటి సమయంలో పట్టాలపై ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ ట్రైన్స్, షటిల్ ట్రైన్స్ భారీగా ప్రయాణిస్తాయి.
5/6
ఈ కారణంగా పగటి సమయంలో పట్టాలపై ట్రైన్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. తరచుగా రెడ్ సిగ్నల్స్ ఇస్తుంటారు. ఫలితంగా ట్రైన్స్ వేగం పగటి సమయంలో తక్కువగా ఉంటుంది.
6/6
ఇక రాత్రి సమయంలో పట్టాలపై రైళ్ల ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల సిగ్నల్స్ కూడా పెద్దగా అడ్డంకిగా మారవు. గ్రీన్స్ సిగ్నల్స్ అందుతుంటాయి. ఫలితంగా వాటి సగటు వేగం రాత్రి సమయంలో పెరుగుతుంటుంది.
Updated at - Sep 19 , 2025 | 01:16 PM