Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండి కూటమి నేతల సమావేశం
ABN, Publish Date - Dec 01 , 2025 | 02:09 PM
కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండి కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ వంటి పలువురు ఇండి కూటమి నేతలు హాజరయ్యారు.
1/6
ఇవాళ(సోమవారం)కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండి కూటమి నేతల సమావేశం జరిగింది.
2/6
ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ వంటి పలువురు ఇండి కూటమి నేతలు హాజరయ్యారు
3/6
పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
4/6
అలానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
5/6
దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చ జరపకుండా, ప్రధాని మరోసారి 'నాటకానికి' తెరలేపారని ఆయన ఘాటుగా విమర్శించారు.
6/6
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Updated at - Dec 01 , 2025 | 02:19 PM