Yemmiganur Jatara: ఎమ్మిగనూరులో జాతర.. కన్నుల పండుగగా రథోత్సవం
ABN, Publish Date - Jan 15 , 2025 | 09:33 PM
Yemmiganur Jatara: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనవరి15వ తేదీ అంటే బుధవారం స్వామి వారి రథోత్సవం ఘనంగా సాగింది. అలాగే పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేటి నుంచి నెల రోజులపాటు ఈ జాతర జరుపుకొంటారు. దాదాపు3 శతాబ్దాల నుంచి ఈ జాతరను రైతుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో భాగంగా పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వ్యవసాయం కోసం కోడెలు, ఎద్దులను కొనుగోలు చేస్తారు. ఈ జాతర కోసం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు ఎమ్మిగనూరుకు తరలిరానున్నారు.
1/16
ఎమ్మిగనూరులో జాతర సందర్భంగా పుర వీధుల్లో కన్నుల పండుగగా రథోత్సవం
2/16
రధోత్సవానికి పోటెత్తిన భక్తులు
3/16
గర్భ గుడిలో కొలువు తీరిన నీలకంఠేశ్వర స్వామి. స్వామి వారిని దర్శించుకొంటున్న భక్తులు
4/16
శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం. స్వామి వారి రథశాల
5/16
స్వామి వారి రథోత్సవాన్ని వీక్షించేందుకు వస్తున్న ఓ కుటుంబం
6/16
రథోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు
7/16
రథోత్సవాన్ని డాబాలపై నుంచి వీక్షిస్తున్న ఎమ్మిగనూరు ప్రజలు
8/16
స్వామి వారి రథోత్సవాన్ని వీక్షిస్తున్న భక్త జన సంద్రం
9/16
రథోత్సవం కోసం ఎమ్మిగనూరులో బందోబస్తు కోసం తరలి వచ్చిన పోలీస్ సిబ్బంది
10/16
జాతరకు తరలి వచ్చే రైతుల కోసం విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు
11/16
జాతరలో రైతులకు విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు
12/16
జాతరకు తరలి వచ్చే రైతుల కోసం విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు
13/16
జాతరకు తరలి వచ్చే రైతుల కోసం విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు
14/16
జాతరలో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు
15/16
జాతరలో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన వ్యవసాయ పనిముట్లు
16/16
జాతరను మిద్దెల పైనుంచి వీక్షిస్తున్న ఎమ్మిగనూరు ప్రజలు
Updated at - Jan 15 , 2025 | 09:35 PM