Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల కిటకిట

ABN, Publish Date - Oct 27 , 2025 | 11:32 AM

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా హైదరాబాద్‌లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠుడిని దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

Updated at - Oct 27 , 2025 | 11:36 AM