CP Radhakrishnan: తిరుమలలో సీపీ రాధాకృష్ణన్కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం..
ABN, Publish Date - Aug 27 , 2025 | 01:44 PM
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం తెల్లవారుజామున శ్రీవెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు.
1/4
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు.
2/4
పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితోపాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు.
3/4
బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు.
4/4
అంతకుముందు రేణిగుంట ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి. నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు.
Updated at - Aug 27 , 2025 | 01:44 PM