Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత..
ABN, Publish Date - Sep 07 , 2025 | 06:08 PM
భాద్రపద పౌర్ణమి నేపథ్యంలో రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలు మూసి వేశారు.
1/7
భాద్రపద పౌర్ణమి నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 7వ తేదీ) రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
2/7
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు అన్ని మూసి వేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ దేవాలయాలన్నీ మూత పడ్డాయి.
3/7
తిరుమలలోని శ్రీవారి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, సూర్య దేవాలయం, తిరుపతిలోని ముఖ్య దేవాలయాలు గోవిందరాజుల స్వామి ఆలయం, కోదండ రామస్వామి ఆలయం, తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయం మూసివేశారు.
4/7
అలాగే విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి వారి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నవరంలోని సత్యదేవుని ఆలయం, సింహచలంలోని శ్రీవారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంతోపాటు పలు ఆలయాలను మూసి వేశారు.
5/7
ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాల నుంచి అర్థరాత్రి 01 గంట 26 నిమిషాల వరకు ఉంటుంది.
6/7
అంటే మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం ఉండనుంది. రాత్రి 11 గంటల 42 నిమిషాలు గ్రహణ మధ్యస్థ కాలంగా జోతిష్య పండితులు నిర్ణయించారు.
7/7
ఈ దేవాలయాలను సోమవారం ఉదయం తిరిగి తెరవనున్నారు. దేవాలయాలను సంప్రోక్షణ అనంతరం భక్తులకు దేవుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు.
Updated at - Sep 07 , 2025 | 07:28 PM