Sharan Navaratri Mahotsavam On Indrakiladri: శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీదుర్గాదేవిని దర్శించేందుకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Sep 30 , 2025 | 09:42 PM
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
1/11
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
2/11
అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
3/11
అలాగే నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు.
4/11
దీంతో లక్షలాది మంది అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు.
5/11
ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. వీటిలో చిన్నారులు, యువతులు పాల్గొంటున్నారు.
6/11
అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అంటే సామూహిక కుంకుమార్చన సైతం నిర్వహిస్తున్నారు. వీటిలో భారీగా భక్తులు పాల్గొంటున్నారు.
7/11
దేవాలయంలో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
8/11
మంగళవారం రాత్రి దుర్గమ్మ వారిని ఇంద్రకీలాద్రిపై ఊరేగించారు.
9/11
భక్తులు భారీగా తరలి వస్తుండడంతో.. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
10/11
మరో వైపు అమ్మవారి జన్మ నక్షత్రం వేళ.. సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
11/11
జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సీఎం చంద్రబాబు దంపతులు.. దుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం విదితమే.
Updated at - Sep 30 , 2025 | 09:44 PM