పుట్టపర్తి సాయిబాబాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Nov 19 , 2025 | 11:02 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. శ్రీ సత్యసాయి అనుభూతులలో కొన్ని క్షణాలు అంటూ ట్వీట్ చేశారు.
1/5
శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన ప్రధాని మోదీ.
2/5
సత్యసాయి బాబాతో వివిధ సందర్భాల్లో కలుసుకున్న ఫోటోలను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు.
3/5
పుట్టపర్తిలో జరగబోయే శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరవడానికి ఎదురుచూస్తున్నాను.
4/5
సత్యసాయి బాబా జీవితం, సమాజ సేవ పట్ల అచంచల నిబద్ధత, ఆధ్యాత్మిక విలువల ద్వారా సమాజానికి మార్గదర్శకత్వం అందించిన తీరు తరతరాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉంది.
5/5
బాబా మాటలు, ఉపదేశాలు, మానవతా సందేశాలు ఎల్లప్పుడూ నా మనసులో వెలుగునింపాయి అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
Updated at - Nov 19 , 2025 | 11:33 AM