అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే..
ABN, Publish Date - Jan 28 , 2025 | 02:08 PM
ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి మొదలుపెట్టిన తొలి ప్రయత్నంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.

"అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా" పేరుతో ప్రజాసమస్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది.

నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది.

ఈ కథనాలకు నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.

సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి మొదలుపెట్టిన తొలి ప్రయత్నంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Updated at - Jan 28 , 2025 | 02:08 PM