Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Aug 29 , 2025 | 06:38 PM
వైజాగ్ టూరిజాన్ని మరింత డెవలప్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు విశాఖపట్నంలో హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
1/12
విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
2/12
ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకూ బీచ్ రోడ్లో పర్యాటక బస్సులు ప్రయాణించనున్నాయి.
3/12
మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి.
4/12
డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.
5/12
24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారు.
6/12
పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
7/12
రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింపచేసేలా ఆదేశాలు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు.
8/12
పర్యాటకులంతా పర్యావరణహితంగా వ్యవహరించాలని.. మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.
9/12
ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
10/12
విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పు ఇచ్చారని సీఎం అన్నారు.
11/12
రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిల్లోనే కొట్టుకు పోయారని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.
12/12
విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్గా ఎదగబోతోందన్నారు సీఎం.
Updated at - Aug 29 , 2025 | 06:38 PM