CM Chandrababu: కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 08 , 2025 | 06:50 PM
చిత్తూరు జల్లా కుప్పంలో ఒకేసారి ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంతో ఆయన ఈ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతోపాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడారు.
1/9
చిత్తూరు జల్లా కుప్పంలో ఒకేసారి ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంతో ఆయన ఈ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతోపాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడారు.
2/9
కుప్పంకు త్వరలో రూ.6,300 కోట్ల పెట్టుబడులతో మరో 8 సంస్థలు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తామని చెప్పారు.
3/9
ఇక్కడి నుంచే పలు ప్రాంతాలకు సౌర విద్యుత్ అందజేస్తామని పేర్కొన్నారు. కుప్పంలో డెయిరీ, పౌల్ట్రీ రంగాలను విస్తరించాలని ఆకాంక్షించారు.
4/9
గతంలో కుప్పంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రారంభించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే రైతుల పిల్లలు సైతం ఐటీ చదివారని వివరించారు.
5/9
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలు చేసిన వారిలో కొందర పారిశ్రామికవేత్తలుగా కూడా మారారన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువాళ్లేనని తెలిపారు.
6/9
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని ప్రకటించారు.
7/9
ఇప్పటికే కుప్పంలో యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయన్నారు.
8/9
ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలను సైతం ప్రోత్సహిస్తామని చెప్పారు. కుప్పం నుంచి విదేశాలకు నాణ్యమైన పండ్లు ఎగుమతి చేస్తామన్నారు. ఎవరికి ఏ వ్యాధి ఉన్నా.. ఇంటి వద్దే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
9/9
రూ. 2,203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో 7 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థలకు ప్రభుత్వం వెంటనే అనుమతి మంజూరు చేసింది.
Updated at - Nov 08 , 2025 | 06:53 PM