ప్రజలకు అండగా నిలుస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి..
ABN, Publish Date - Jan 28 , 2025 | 01:12 PM
తాజాగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రెడ్డి, ఏస్ఈ భాస్కర్ రావును ఈ కార్యక్రమానికి తీసుకువచ్చింది.
1/8
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
2/8
ప్రజాసమస్యలు తీర్చేందుకు "అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా" అనే కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి చేపట్టింది.
3/8
వెలగని వీధి దీపాల నుంచి రోజుల తరబడి తొలగించని చెత్త దాకా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది.
4/8
రోడ్లపై గుంతల నుంచి కుళాయిల్లో రాని నీళ్ల దాకా సమస్యలను ప్రజాప్రతినిధుల ముందుకు తీసుకెళ్తోంది.
5/8
ప్రజల వద్దకే పాలన అన్నట్లు.. ప్రజాప్రతినిధులు, అధికారులను తీసుకువచ్చి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా చూపిస్తోంది.
6/8
తాజాగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రెడ్డి, ఏస్ఈ భాస్కర్ రావును ఈ కార్యక్రమానికి తీసుకువచ్చింది.
7/8
నగరంలోని 32వ డివిజన్లో అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించింది.
8/8
స్థానికులతో కలిసి సమస్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వారి దృష్టికి తీసుకెళ్లగా.. పరిష్కరిస్తామని ఎమ్మెల్యే, అధికారులు హామీ ఇచ్చారు.
Updated at - Jan 28 , 2025 | 01:13 PM