Share News

Indian military bases: పాక్‌కు సైనిక రహస్యాలు.. ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - May 05 , 2025 | 04:56 AM

పంజాబ్‌లో సైనిక సమాచారం పాక్‌కు పంపిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Indian military bases: పాక్‌కు సైనిక రహస్యాలు.. ఇద్దరి అరెస్టు

చండీగఢ్‌, మే 4: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్‌లో సైనిక కంటోన్మెంట్లు, వైమానిక ఎయిర్‌ బేస్‌ల సమాచారం, చిత్రాలు పాక్‌కు చేరవేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద పాలక్‌ షేర్‌ మాసి, సూరజ్‌ మాసి అనే ఇద్దరు వ్యక్తులను అమృత్‌సర్‌ రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలతో వారికి సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అమృత్‌సర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న హర్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ పిట్టు ద్వారా వీరు పాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుసుకున్నారు. మరోవైపు, జమ్ము, కశ్మీర్‌లోని రంబన్‌ జిల్లాలో ఆదివారం ట్రక్కు లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి చెందారు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:56 AM