Share News

Pahalgam Terror Attack: పహల్గాం ఘటనపై ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ యూటర్న్..

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:55 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో

Pahalgam Terror Attack: పహల్గాం ఘటనపై ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ యూటర్న్..
Pahalgam terror attack

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో కూడా తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. భారత్ తమ వ్యవస్థలను హ్యాక్ చేసి ఆ పోస్ట్ చేసిందని టీఆర్ఎఫ్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇలా చేస్తోందని.. ఇదేమీ తొలిసారి కాదని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తాజా ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Apr 26 , 2025 | 02:55 PM