Share News

Sikkim Diwali 2025: దీపావళి ముందు సిక్కిం షాకింగ్ నిర్ణయం.. ఫైర్‌క్రాకర్లు(బాణాసంచా)పై నిషేధం

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:33 PM

దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బాణాసంచా(ఫైర్ క్రాకర్స్)ను నిషేధించింది. అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. బదులుగా లైట్ డిస్‌ప్లేలు, డియోలు, ఇతర పర్యావరణ హితమైన..

Sikkim Diwali 2025:  దీపావళి ముందు సిక్కిం షాకింగ్ నిర్ణయం..  ఫైర్‌క్రాకర్లు(బాణాసంచా)పై నిషేధం
Sikkim Bans Firecrackers

గాంగ్‌టాక్(సిక్కిం), అక్టోబర్ 18, 2025: దీపాల పండుగ దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర పర్యావరణ కంట్రోల్ బోర్డు (ఎస్‌పీసీబీ) దీపావళి పండుగకు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది.

అదే సమయంలో, పండుగ సందర్భంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని నివారించాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ ఆర్డర్ ఇవాళ (శనివారం అక్టోబర్ 18న) ప్రకటించారు. దీపావళి అక్టోబర్ 20న జరగనున్న సందర్భంగా ఇది అమలులోకి వస్తుంది. పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిషేధాలు విధించారు.


పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆకాశ, వాయు, ధ్వని కాలుష్యాలను నివారించడమే లక్ష్యంగా ఈ బాణాసంచా నిషేద నిర్ణయం తీసుకున్నారు. ఫైర్‌క్రాకర్లు పేలడం వల్ల రాత్రి ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లు మట్టి, నీటి కాలుష్యానికి కారణమవుతాయని బోర్డు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఇటీవల (అక్టోబర్ 15) ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో 'గ్రీన్ ఫైర్‌క్రాకర్లు'కు మాత్రమే పరిమిత అనుమతి ఇచ్చినప్పటికీ, సిక్కిం పూర్తి నిషేధాన్ని విధించాలని నిర్ణయించడం విశేషం. పర్యావరణ హితమైన పండుగలకు సూచనలు కూడా ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ కంట్రోల్ బోర్డ్ చేసింది. ప్రజలు ఫైర్‌క్రాకర్లకు బదులు లైట్ డిస్‌ప్లేలు, డియోలు, ఇతర పర్యావరణ హితమైన విధానాలతో దీపావళిని జరుపుకోవాలని ఎస్‌పీసీబీ పిలుపునిచ్చింది. 'పండుగ సంబరాలను పర్యావరణానికి హాని చేయకుండా ఆసక్తికరంగా చేయాలి' అని బోర్డు ప్రకటనలో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు బెంచ్ (సిజేఐ బీఆర్ గావై, జస్టిస్ కె వినోద్ చంద్రా) మాటల్లో, 'పర్యావరణ సమస్యలను దెబ్బతీయకుండా, సమతుల్య విధానంతో మితంగా పండుగ చేయాలి' అని సూచించారు. కాగా, ప్రపంచంలోనే మొదటి.. పూర్తి ప్లాస్టిక్-ఫ్రీ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న సిక్కిం ఇప్పుడు.. దీపావళి టపాసులు వాడకం మీదా కఠిన నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 05:59 PM