Share News

Misleading Drug ads: మా ఆదేశాలు ఎందుకు పాటించలేదు?

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:28 AM

ఈ నెలాఖరులోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని, తదుపరి విచారణ జరిగే మార్చి 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు హాజరుకావాలని ఆయా రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

Misleading Drug ads: మా ఆదేశాలు ఎందుకు పాటించలేదు?

తప్పుడు ఔషధ ప్రకటనల అంశంలో ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తప్పుదోవ పట్టించే ఔషధ ప్రకటనల విషయంలో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించినప్పటికీ, న్యాయస్థానం ఆదేశాలను ఎందుకు పాటించడంలేదని ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని, తదుపరి విచారణ జరిగే మార్చి 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు హాజరుకావాలని ఆయా రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఔషధ ప్రకటనలు ఉంటున్నాయంటూ పతంజలి సంస్థ, యోగా గురు రామ్‌దేవ్‌బాబాపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 2022 ఆగస్టు 10న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో, ఈ తరహా ప్రకటనలపై తీసుకున్న చర్యల గురించి అఫిడవిట్లు దాఖలు చేయాలని గత ఏడాది మే 7న అన్ని రాష్ర్టాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 05:28 AM