Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
ABN , Publish Date - Jun 19 , 2025 | 08:05 AM
టెంపోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ముంబై, జూన్ 19: మహారాష్ట్ర పుణె జిల్లాలోని జేజూరి - మోర్గాన్ రహదారిపై టెంపోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను జేజూరిలోని శాంతాయ్ ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుంచి రిఫ్రిజరేటర్ను వ్యక్తులు కిందకి దింపుతున్నారు.
ఆ క్రమంలో వేగం వచ్చిన కారు.. ఆ టెంపోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రుల్లో ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతులు సోమనాథ్ రామచంద్ర, రాము సంజీవని యాదవ్, అక్షయ్ కుమార్ చవాన్, అజిత్ అశోక జాదవ్, కిరణ్ భరత్ రౌత్, అశ్విని సంతోష్, అక్షయ్ రౌత్గా గుర్తించినట్లు చెప్పారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వివరించారు.
ఈ వార్తలు కూడ చదవండి..
మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. రవి, అరుణ మృతి
ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ లంచ్ భేటీ
For National News And Telugu News