Share News

చిన్న రుణ గ్రహీతలను మినహాయించండి

ABN , Publish Date - May 31 , 2025 | 06:10 AM

RBI విడుదల చేసిన బంగారం రుణాల మార్గదర్శకాలపై తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సన్నకారు రుణగ్రహీతలకు ప్రభావం తగలకుండా కొత్త మార్గదర్శకాలు ఉండాలని RBIకి సూచించింది.

చిన్న రుణ గ్రహీతలను మినహాయించండి

పసిడిపై 2 లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి మినహాయింపు

తమిళ పార్టీల వ్యతిరేకతతో ఆర్బీఐకి కేంద్ర ఆర్థిక శాఖ సూచన

న్యూఢిల్లీ, మే 30: బంగారం తాకట్టుపెట్టి రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే చిన్న రుణ గ్రహీతలను కొత్త మార్గదర్శకాల నుంచి మినహాయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్ర ఆర్ధిక శాఖ సూచించింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 9న బంగారం రుణాలపై ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసింది. బంగారం తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణ విలువ పసిడి విలువలో 75ు కంటే ఎక్కువ ఉండరాదని మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనిపై తమిళనాడులో ని రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ మార్గదర్శకాల వల్ల సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టమవుతుందని, జోక్యం చేసుకోవాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాశారు. దీంతో ఆర్‌బీఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలను ఆర్థికసేవల విభాగం పరిశీలించి చిన్న రుణ గ్రహీతలపై ప్రభావం పడకుండా కొత్త మార్గదర్శకాలు ఉండాలని సూచించింది.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 06:10 AM