Share News

CET exam: జంధ్యం వివాదంలో ప్రిన్సిపాల్‌ తొలగింపు

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:35 AM

బీదర్‌ జిల్లా సాయిస్ఫూర్తి కళాశాలలో సీఈటీ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి సుచివ్రత్‌ కులకర్ణి సమస్యపై కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ బిరాదార్‌, ఉద్యోగి సతీశ్‌పవార్‌ను విధుల నుంచి తొలగించారు. దీనిపై మంత్రి ఈశ్వర్‌ఖండ్రె విద్యార్థికి ఉచిత సీటు అందిస్తామని హామీ ఇచ్చారు.

 CET exam: జంధ్యం వివాదంలో ప్రిన్సిపాల్‌ తొలగింపు

బెంగళూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): వృత్తి విద్యాకోర్సుల ప్రవేశ పరీక్ష (సీఈటీ) రాసేందుకు వెళ్లే విద్యార్థులను జంధ్యం తొలగించాలని నిబంధన విధించిన ఘటనలో బీదర్‌ జిల్లా సాయిస్ఫూర్తి కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ బిరాదార్‌ను విధుల నుంచి తొలగించారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రిన్సిపాల్‌తోపాటు ఉద్యోగి సతీశ్‌పవార్‌ను కూడా తొలగించారు. ఈ వివాదంలో మ్యాథ్స్‌ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి సుచివ్రత్‌ కులకర్ణి ఇంటికి బీదర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈశ్వర్‌ఖండ్రె వెళ్లారు. భాల్కిలోని బీమణ్ణఖండ్రె ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉచితంగా సీటు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:35 AM