PM Modi: బీజేపీ అభ్యర్థికి మోదీ పాదాభివందనం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:34 AM
సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రధానికి పరిచయం చేశారు. వారంతా ఆయనకు పాదాభివందనం చేశారు.

ఢిల్లీ బహిరంగ సభలో సన్నివేశం
న్యూఢిల్లీ, జనవరి 30: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి పాదాభివందనం చేయడం ఆకట్టుకొంది. గురువారం ఘోండాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రధానికి పరిచయం చేశారు. వారంతా ఆయనకు పాదాభివందనం చేశారు. ప్రతా్పగంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రవీందర్ సింగ్ నేగి (45)ని పరిచయం చేయబోగా ఆయన కూడా పాదాభివందనం చేశారు. కానీ మోదీ తిరిగి మూడుసార్లు ఆయనకు పాదాభివందనం చేశారు. నేగి ప్రస్తుతం బీజేపీ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఆయనకు వివాదాస్పదుడన్న పేరుంది.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News